ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : వార్డు ప్రజలకు ప్రతి సంక్షేమ పథకాన్ని అందించడం వార్డు కౌన్సిలర్ చేతిలోనే ఉంటుందని ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ జనార్దన్ రాథోడ్, మాజీ మాజీ మంత్రి జోగు రామన్న లు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్ లో ఏర్పాటు చేసిన బి ఆర్ఎస్ పార్టీ చేరికల కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న తో పాటు ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల ఇంచార్జ్ జనార్దన్ రాథోడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.కాలనీ వాసులు మంగళ హారతులతో ఘనస్వాగతం పలికి శాలువాఘనంగా సత్కరించారు. అనంతరం 300 మంది కి పార్టీ లో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిఅభినందనలు తెలిపారు. చేరికల అనంతరం వారితో కలిసి కూర్చొని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బి ఆర్ఎస్ పార్టీ తరఫున పోటీలో ఉన్న వ్యక్తి ఎవరైనా, కలిసికట్టుగా పనిచేసి ఘన విజయాన్ని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఏస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News