Wednesday, 29 July 2026 12:04:41 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ఇసుక దోపిడీదారులపై కలెక్టర్ ఆగ్రహం..! మూడు ట్రాక్టర్లు సీజ్..

Date : 01 April 2026 10:51 PM Views : 230

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లాలో అనుమతిలేని ఇసుక దందాలకు చెక్ పెట్టేందుకు జిల్లా కలెక్టర్ కె హరిత బుధవారం స్వయంగా రంగంలోకి దిగారు. కొమురం భీం జిల్లాలో అనుమతిలేని ఇసుక నదీ గర్భాన్ని కొల్లగొడుతున్న అక్రమార్కుల పాలిట సింహ స్వప్నంలా విరుచుకుపడ్డారు. బుధవారం రెబ్బెన మండలం రాంపూర్ శివారులో కలెక్టర్ జరిపిన మెరుపు తనిఖీలో జిల్లావ్యాప్తంగా కలకలం సృష్టించింది. కాగజ్ నగర్ పెద్దవాగును అడ్డాగా చేసుకుని ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా యథేచ్ఛగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణాను కలెక్టర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాంపూర్ గ్రామం సమీపంలో వాగు నుండి ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను ఆమె స్వయంగా అడ్డుకున్నారు. అధికారుల కళ్లు గప్పి ఇసుకను తరలించవచ్చన్న ధీమాతో ఉన్న అక్రమార్కులకు కలెక్టర్ ఊహించని షాక్ ఇచ్చారు. ట్రాక్టర్లను పరిశీలించిన సమయంలో కనీసం అనుమతి పత్రాలు కూడా లేకపోవడంతో కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే ఆ వాహనాలను సీజ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి పర్యావరణాన్ని నాశనం చేసే ఇసుక మాఫియాను ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. అక్రమ రవాణాకు పాల్పడే వాహనాలపై పీడీ యాక్ట్ తరహాలో కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడబోం అని జిల్లాలోని ప్రతి వాగుపై నిఘా ఉంచాం అన్నారు. ఇకపై తనిఖీలు మరింత ఉధృతం చేస్తాం అని తెలిపారు. కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయిలోకి దిగి నిఘా పెట్టడంతో జిల్లాలోని ఇసుక మాఫియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కార్యాలయాల్లో కూర్చోవడం మాత్రమే కాదు, అక్రమాలను అరికట్టేందుకు రోడ్ల పైకి వస్తామని ఆమె చేతల్లో చూపించడం,అధికారుల అండదండలతో సాగుతున్నాయో లేదా తెలియాల్సిన అవసరం ఉంది అన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :