ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : క్రీడలు శరీరదారుడంతో పాటు మానసిక దర్యాని పెంపొందిస్తాయని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ మంగ తెలిపారు. శనివారం పాఠశాల ఆవరణలో అండర్ 19 బాలుర బాలికల రెజ్లింగ్ జిల్లాస్థాయి పోటీలను నిర్వహించారు. ఈ గేమ్స్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనిఅండర్ 19 బాల బాలికలు పోటీలలో పాల్గొన్నారు. ముందుగా ప్రిన్సిపల్ సిహెచ్ మంగ పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలలో గెలిచిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన బాబురావు మరియు పిఈటి సుదీప్, పి .డి సిహెచ్ నాంపల్లి పాల్గొని పోటీలను నిర్వహించారు.న ఈ రెజ్లింగ్ పోటీలలో మొదటి స్థానం సాధించిన ఎం జె పి విద్యార్థులు, జిల్లాస్థాయి లో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులు వి శ్రీరాం. ఆర్ సాయి జస్వంత్. ఎం ప్రశాంత్. ఐ అభినయ్. జై బాలాజీ ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. వీరంతా ఈనెల 21 నుండి 23 వరకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీలు పాల్గొంటారు. ఎంపికైన క్రీడాకారులను ప్రిన్సిపాల్ మంగ, పిడి నాంపల్లి, పి ఈ టి రాజేష్, ఉపాధ్యాయ లు అభినందించారు.
Admin
E Nivas News