ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఉట్నూర్ ఐటిడిఏ పిఓ గా నూతనంగా నియమతులైన పిఓ యువరాజ్ మర్మాట్ ను గురువారం మానవ హక్కుల జిల్లా కమిటీ చైర్మన్ రమేష్ రాథోడ్ పలువురు నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం చైర్మన్ తోపాటు కమిటీ సభ్యులు, ఆడ.సోనారావు,కనక సీతారాం, తొడసం.రమేష్ సోయం. సత్పత్రావు పీవో కు పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అసిఫాబాద్ డిటిడిఓ కార్యాలయంలో పెండింగ్లో ఉన్న ఆర్ ఓ ఎఫ్ ఆర్ విరాసత్ దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం జిల్లాలో చలి తీవ్రత రోజుకు పెరుగుతుండడంతో ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులు చలినీటితో స్నానం చేస్తూ ఇబ్బందులు పడుతున్నారని వాటర్ హీటర్ సౌకర్యం కల్పించి స్నానం కొరకు వేడి నీటిని విద్యార్థులకు అందించాలని కోరారు. విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసి విద్యార్థులు నేలపై పడుకోకుండా పడకలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే లింగాపూర్ మండలంలోని హీరాపూర్ టి డబ్ల్యూ పి ఎస్ పాఠశాలను యుడైస్లో నమోదు చేసి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం తక్షణమే అమలు అయ్యేలా చర్యలు తీసుకొని వీలైనంత త్వరగా పాఠశాలకు పక్కా భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కెరమెరి మండలంలోని జోడేఘాట్ వెళ్లే రహదారి మార్గంలో కోపాగూడ వద్ద ప్రమాదకరమైన లోతైన గుంత (క్వారీ) వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
Admin
E Nivas News