Tuesday, 28 July 2026 10:09:51 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ మర్యాదపూర్వకంగా కలిసిన మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్

Date : 20 November 2025 08:50 PM Views : 224

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఉట్నూర్ ఐటిడిఏ పిఓ గా నూతనంగా నియమతులైన పిఓ యువరాజ్ మర్మాట్ ను గురువారం మానవ హక్కుల జిల్లా కమిటీ చైర్మన్ రమేష్ రాథోడ్ పలువురు నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం చైర్మన్ తోపాటు కమిటీ సభ్యులు, ఆడ.సోనారావు,కనక సీతారాం, తొడసం.రమేష్ సోయం. సత్పత్రావు పీవో కు పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అసిఫాబాద్ డిటిడిఓ కార్యాలయంలో పెండింగ్లో ఉన్న ఆర్ ఓ ఎఫ్ ఆర్ విరాసత్ దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం జిల్లాలో చలి తీవ్రత రోజుకు పెరుగుతుండడంతో ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులు చలినీటితో స్నానం చేస్తూ ఇబ్బందులు పడుతున్నారని వాటర్ హీటర్ సౌకర్యం కల్పించి స్నానం కొరకు వేడి నీటిని విద్యార్థులకు అందించాలని కోరారు. విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసి విద్యార్థులు నేలపై పడుకోకుండా పడకలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే లింగాపూర్ మండలంలోని హీరాపూర్ టి డబ్ల్యూ పి ఎస్ పాఠశాలను యుడైస్లో నమోదు చేసి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం తక్షణమే అమలు అయ్యేలా చర్యలు తీసుకొని వీలైనంత త్వరగా పాఠశాలకు పక్కా భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కెరమెరి మండలంలోని జోడేఘాట్ వెళ్లే రహదారి మార్గంలో కోపాగూడ వద్ద ప్రమాదకరమైన లోతైన గుంత (క్వారీ) వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :