ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / సిరోల్ : మహబూబాద్ జిల్లా సిరోల్ మండల కేంద్రంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం సిరోల్ మండల సభకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ, జిల్లా ప్రధాన కార్యదర్శి గౌనీ వెంకన్న, జిల్లాలో కల్లు గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న 25 వేల కుటుంబాల ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కల్లుగీత కార్మికులకు 5 వందల కోట్లు కేటాయించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గౌనీ వెంకన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తరతరాల నుండి కల్లుగీత వృత్తి చేస్తూ ప్రభుత్వానికి వేలాది కోట్ల పన్నులు చెల్లించారు కానీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గీత కార్మికుల సంక్షేమాన్ని విస్మరించారని అన్నారు. అతి ప్రమాదకరమైన కల్లుగీత వృత్తి చేస్తున్న గీత కార్మికులందరికీ ఎలాంటి రాజకీయ ఒత్తిడిలేకుండా ప్రమాదాలు నివారించుటకై సేఫ్టీ కిట్లు అందించాలని. స్వయం ఉపాధి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కల్లుగీత కార్మికులకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అన్నారు. ప్రభుత్వ లిక్కర్ పాలసీ వలన రోజు రోజుకి వృత్తి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం లిక్కర్, బెల్ట్ షాపుల ద్వారా మద్యం ఏరులై పారిస్తూ గీత కార్మికుల వృత్తిని, ఉపాధిని దెబ్బతీస్తుందని అన్నారు. ప్రతీ సొసైటీకి 5 ఎకరాల భూమి, కల్లుకు మార్కెట్ సౌకర్యం నీరా తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమను త్వరగా ప్రారంభించి యువతి, యువకులకు, కల్లుగీత కార్మికులకు ఉపాధి కల్పించాలని కల్లుగీత వృత్తి చేస్తున్న ప్రతి ఒక్కరికి మోటార్ బైక్ లు ఇవ్వాలని, కల్లుగీత వృత్తిదారులకు గీతన్న బంధు పేరుతో 10 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెన్షన్ ఐదు వేలకు పెంచాలని మెడికల్ బోర్డు నిబంధన తొలగించాలని, అర్హులైన వారందరికీ సభ్యత్వం, గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. జిల్లా అధ్యక్షులు యమగాని వెంకన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కల్లు గీత కార్మికులకు ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సొసైటీ కి ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని, బెల్టు షాపులను నిరోధించాలని, సొసైటీలో కమ్యూనిటీ భవనాలు ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న ఎక్స్గ్రేషియోను తక్షణమే విడుదల చేయాలని , కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిరోల్ మండల కేంద్రంలోని నగేష్ ఫంక్షనల్ లో జరిగిన మహాసభలో గునిగంటి మల్లయ్య అధ్యక్షత వహించిన మహాసభల్లో జిల్లా అధ్యక్షులు యమగాని వెంకన్న, ప్రధాన కార్యదర్శి గౌని వెంకన్న, నూతన కమిటీ ప్రకటించారు. సిరోల్ మండల అధ్యక్షులు గునిగంటి మల్లయ్య, ఉపాధ్యక్షులు బట్టు వెంకన్న మండల ప్రధాన కార్యదర్శి రెడ్డి మల్ల శ్రీనివాస్, సహాయ కార్యదర్శి ఉడుగుల వీరన్న, కమిటీ సభ్యులు రెడ్డి మల్లఉపేందర్, ఉడుగుల వీరన్న, పెద్ది మల్లయ్య, పెద్ది అనిల్, గంధసిరి రాజు, గంధసిరి రాకేష్, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News