ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులు,రుసుములు, చెల్లింపులపై రాయితీ, దరఖాస్తుల పరిష్కారం కొరకు మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం జూలై 31వ తేదీ వరకు ఎల్.ఆర్.ఎస్. రుసుములు, చార్జీల చెల్లింపుపై 25 శాతం రాయికి అవకాశం కల్పించిందని, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పెండింగ్ లో ఉన్న ఎల్.ఆర్.ఎస్. దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దరఖాస్తుల పరిష్కారంపై ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ కార్యాలయ పని వేళలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుందని, దరఖాస్తుదారులు 08736-250501 నంబర్ లో సంప్రదించవచ్చని తెలిపారు.
Admin
E Nivas News