Monday, 02 March 2026 03:23:05 PM
# మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం... # విద్యార్థుల సంక్షేమం, విద్యాభ్యాసానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం... # రక్తం దానం చేసిన కాంగ్రెస్ యువ నాయకుడు బీరెల్లి రజిని కుమార్ # మాదిగ అమరవీరులకు ఘన నివాళులు # బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి # భూపాలపల్లి పట్టణ అభివృ ద్ధికి సమగ్ర చర్యలు తీసు కోవాలి # దొంగ నోట్ల చెలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ తెలంగాణ చీఫ్ బ్యూరో # ఇంటర్మీడియట్ పరీక్షల సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్... # జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా శ్రీనివాస్ రావు బాధ్యతల స్వీకరణ... # సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ # ఘనంగా అయిదవ సైన్స్ ఫెయిర్ వార్షికోత్సవ వేడుకలు.. # విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.. # నకిలీ గోల్డ్ బి స్కెట్లు ఇచ్చి.. కిలో అసలుతో బంగారు నగలు తో పరారీ... # ప్రతాపసింగారంలో స్పాట్‌లైట్ క్రికెట్ మైదానం ప్రారంభించిన మంత్రి జీ. వివేక్... # రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీఎంకు విద్యా కమిషన్ నివేదిక # మార్చిలో 18 రోజులు బ్యాంకులు బంద్.. # 103 కిలోల బరువున్నా మహిళకు విజయవంతమైన శస్త్ర చికిత్స # జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులపై హైకోర్టులో విచారణ.. ఏప్రిల్30 వరకు గడువు పొడిగింపు.. # గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలి... # పేదింటి ఆడబిడ్డ పెళ్లికి వరంలా కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం...

మహిళలు రాజకీయాల్లో ముందుకు రావాలి... మీనాక్షి నటరాజన్

Date : 25 February 2026 10:58 PM Views : 34

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కోరారు.వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్ లో ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుల కోసం నిర్వహిస్తున్న పది రోజుల శిక్షణా శిబిరం ఐదవ రోజైన బుధవారం కార్యక్రమం జరిగింది. ఈ శిబిరం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పర్యవేక్షణలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని, సమాన అవకాశాలు కల్పించడం ద్వారా రాజకీయ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని వివరించారు. యువత, మహిళలు రాజకీయాల్లోకిరావాలని పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ రంగం, రాజకీయాల అనుసంధానంపై పలు సూచనలు చేశారు. రైతుల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటి పరిష్కారానికి పార్టీ స్థాయిలో చర్చలు జరిపి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. గ్రామీణాభివృద్ధి, సాగు విధానాల్లో మార్పులు, మార్కెటింగ్ సౌకర్యాల మెరుగుదల వంటి అంశాలపై దృష్టి సారించాలని చెప్పారు. శిబిరంలో పాల్గొన్న డిసిసి అధ్యక్షులు పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలపై స్పందన,సోషల్ మీడియా వినియోగం, బూత్ స్థాయి వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. ఈ శిబిరం ద్వారా జిల్లాస్థాయిలో పార్టీ కార్యకలాపాలను మరింతసమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే విధంగా నాయకులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :