Sunday, 13 September 2026 12:55:21 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

మహిళలు రాజకీయాల్లో ముందుకు రావాలి... మీనాక్షి నటరాజన్

Date : 25 February 2026 10:58 PM Views : 270

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కోరారు.వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్ లో ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాల జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) అధ్యక్షుల కోసం నిర్వహిస్తున్న పది రోజుల శిక్షణా శిబిరం ఐదవ రోజైన బుధవారం కార్యక్రమం జరిగింది. ఈ శిబిరం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పర్యవేక్షణలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందని, సమాన అవకాశాలు కల్పించడం ద్వారా రాజకీయ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని వివరించారు. యువత, మహిళలు రాజకీయాల్లోకిరావాలని పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ రంగం, రాజకీయాల అనుసంధానంపై పలు సూచనలు చేశారు. రైతుల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటి పరిష్కారానికి పార్టీ స్థాయిలో చర్చలు జరిపి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. గ్రామీణాభివృద్ధి, సాగు విధానాల్లో మార్పులు, మార్కెటింగ్ సౌకర్యాల మెరుగుదల వంటి అంశాలపై దృష్టి సారించాలని చెప్పారు. శిబిరంలో పాల్గొన్న డిసిసి అధ్యక్షులు పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలపై స్పందన,సోషల్ మీడియా వినియోగం, బూత్ స్థాయి వ్యవస్థ బలోపేతం వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. ఈ శిబిరం ద్వారా జిల్లాస్థాయిలో పార్టీ కార్యకలాపాలను మరింతసమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే విధంగా నాయకులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: