ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : తనకు కౌన్సిలర్ గా అవకాశం ఇస్తే సేవకునిగా ఎల్లప్పుడు అందుబాటులో ఉండి సేవ చేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి పెంటరి రాజు పేర్కొన్నారు. శుక్రవారం మంథని మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించి చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా పెంటరి రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ తోనే మంథని మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కాంగ్రెస్ పేదల ప్రభుత్వమని, పేదల ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ వల్లనే వార్డు అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం, 200ల యూనిట్ల ఉచిత విద్యుత్, సబ్సిడీపై గ్యాస్ సిలిండర్, ఉచిత బస్ ప్రయాణం ప్రవేశపెట్టి మహిళల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికసంఖ్యలో యువత పాల్గొన్నారు.
Admin
E Nivas News