ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : బిజెపి నేత చైతన్య విద్యాసంస్థల చైర్మన్ ముల్కల మల్లారెడ్డి60 గత ఆరు నెలలుగా అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ గురువారం హైదరాబాదులోని ఆయన స్వగృహంలో మృతి చెందాడు. కాగా మంథని స్వగ్రామానికి చెందిన మల్లారెడ్డిప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తి చేస్తున్న తరుణంలో, బిజెపి చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రైవేటు విద్యాసంస్థలను నెలకొల్పి పేద విద్యార్థులకు విద్యను అందించడంలో తన వంతు సహాయంగా కృషి చేశాడు. దానికి తోడు అతడు భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించడంతో పార్టీ అధిష్టానం మల్లారెడ్డి మంచిర్యాల నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కూడా కేటాయించింది. అప్పుడు దాదాపు 12 వేల ఓట్లు కూడా వచ్చాయి. దీంతో ఆయన కాస్త బిజెపి నాయకత్వంలో తనదైన శైలిలో చెరగని ముద్ర వేసుకున్నాడు. గత ఆరు నెలల క్రితం మెదడులో కాస్త నొప్పి రావడంతో ఆసుపత్రిలో చికిత్స చేసుకోగా బ్రెయిన్ క్యాన్సర్ అని తెలియడంతో అప్పటినుండి ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటూనే ఉంటూ పలు పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఇటీవల మళ్ళీ వ్యాధి తీవ్రం కావడంతో చికిత్స కోసం వెళ్లగా పక్షవాతం రావడంతో మరింత పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం ఆయన స్వగృహంలో మృతి చెందినట్లు కుటుంబీకులు, పార్టీ నాయకులు తెలిపారు. మల్లారెడ్డి మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని పలువురు బిజెపి నాయకులు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Admin
E Nivas News