Tuesday, 28 July 2026 04:38:00 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

అనారోగ్యంతో బిజెపి నేత ముల్కల మల్లారెడ్డి మృతి..

Date : 23 July 2026 09:13 PM Views : 53

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : బిజెపి నేత చైతన్య విద్యాసంస్థల చైర్మన్ ముల్కల మల్లారెడ్డి60 గత ఆరు నెలలుగా అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ గురువారం హైదరాబాదులోని ఆయన స్వగృహంలో మృతి చెందాడు. కాగా మంథని స్వగ్రామానికి చెందిన మల్లారెడ్డిప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తి చేస్తున్న తరుణంలో, బిజెపి చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై తన ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రైవేటు విద్యాసంస్థలను నెలకొల్పి పేద విద్యార్థులకు విద్యను అందించడంలో తన వంతు సహాయంగా కృషి చేశాడు. దానికి తోడు అతడు భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించడంతో పార్టీ అధిష్టానం మల్లారెడ్డి మంచిర్యాల నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ కూడా కేటాయించింది. అప్పుడు దాదాపు 12 వేల ఓట్లు కూడా వచ్చాయి. దీంతో ఆయన కాస్త బిజెపి నాయకత్వంలో తనదైన శైలిలో చెరగని ముద్ర వేసుకున్నాడు. గత ఆరు నెలల క్రితం మెదడులో కాస్త నొప్పి రావడంతో ఆసుపత్రిలో చికిత్స చేసుకోగా బ్రెయిన్ క్యాన్సర్ అని తెలియడంతో అప్పటినుండి ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటూనే ఉంటూ పలు పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఇటీవల మళ్ళీ వ్యాధి తీవ్రం కావడంతో చికిత్స కోసం వెళ్లగా పక్షవాతం రావడంతో మరింత పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం ఆయన స్వగృహంలో మృతి చెందినట్లు కుటుంబీకులు, పార్టీ నాయకులు తెలిపారు. మల్లారెడ్డి మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని పలువురు బిజెపి నాయకులు ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :