Thursday, 30 July 2026 04:11:07 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

అయిదు తరాల అపురూప సమ్మేళనం

Date : 26 December 2025 12:19 AM Views : 302

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఒక్క వేదికపైకి చేరిన 200 మంది కొంతం కిష్టయ్య కుటుంబ వారసులు ఆదర్శం ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి విలువలు ప్రశ్నార్థకమవుతున్న ప్రస్తుత తరుణంలో ఇదొక ప్రత్యేకత సంతరించుకుంది. ఒకే కుటుంబానికి చెందిన దాదాపు 200 మంది ఒక వేదికపై కలుసుకుని ఆనందానుభూతిని పొందిన సందర్భమిది. పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన కొంతం కిష్టయ్య, అమ్మాయి దంపతుల వారసులు గురువారం హైదరాబాద్ కొండాపూర్ లోని అపర్ణా సెరేన్ కమ్యూనిటీ లో కలుసుకున్నారు. 80 ఏళ్ల వృద్ధులు మొదలుకొని ఆరు నెలల శిశువుల వరకు అయిదు తరాల వారు ఇందులో పాలు పంచుకున్నారు. సామాన్య నేపథ్యం నుంచి మొదలైన ఒక కుటుంబం, కేవలం చదువునే ఆయుధంగా మలుచుకుని ఐదు తరాల సంబరాన్ని జరుపుకోవడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న ఈ కుటుంబం, నేడు సమాజంలో పదిమందిని నడిపించే నాయకత్వ స్థానాలకు ఎదగడం వారి కష్టానికి నిదర్శనం. ఈ అపురూప కలయికలో నాటి కష్టాలను తలుచుకుంటూ, నేటి విజయాలను చూసి ఆ కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. తమ మూలాలను మరువకుండా, విద్య ద్వారా తలరాతను మార్చుకోవచ్చని నిరూపించిన ఈ ఐదు తరాల ప్రయాణం నేటి సమాజానికి ఒక గొప్ప స్ఫూర్తి. పెద్దల ఆశీస్సులు, పిల్లల ప్రగతి కలగలిసిన ఈ వేడుక ఒక అద్భుత దృశ్యంగా నిలిచింది. ఈ సందర్భంగా కుటుంబ వృక్షాన్ని చిత్రరూపకంగా ప్రదర్శించారు.‌ తర్వాత ప్రతి కుటుంబానికి చెందిన వారు పరిచయం చేసుకున్నారు. ఆటపాటలు, చిన్నారుల కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.‌ మంథని ఫ్యామిలీ గ్రూప్ వాట్సాప్ బృందం ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసి విజయవంతం చేసింది. రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి అనేక వ్యయ ప్రయాసలకోర్చి, చలిని కూడా లెక్క చేయకుండా అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. కుటుంబ పెద్దల విలువలు, సభ్యులందరి ఫొటోలు, పరిచయాలతో ప్రత్యేక పుస్తకాన్ని ప్రచురించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. విదేశాల్లో ఉంటున్న కుటుంబ సభ్యులు ఆన్లైన్ లో పాల్గొన్నారు. ఇలాంటి వేడుకలు ప్రస్తుతం అత్యంత అవసరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కుటుంబ సమ్మేళనంలో లక్షెటిపేట మరియు మంచిర్యాల నుండి పలు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :