ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మానేయనే త్యాగాలతో దేశీ సేవలో ముందుకు వెళ్లాలని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.సాయుధ పోలీసుల గౌరవ వందనం, జాతీయ గీతాలాపన మధ్య ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎందరో మహనీయుల ప్రాణత్యాగాల ఫలితమే మన స్వతంత్ర భారతం అని గుర్తుచేశారు.పోలీసు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపి, మిఠాయిలు పంపిణీ చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను భావితరాలకు తెలియజేస్తూ, వారి స్ఫూర్తితో దేశ సేవలో ప్రతి ఒక్కరూ కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు ఉన్నతాధికారులు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News