ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని ప్రతాపగిరి గ్రామ పంచాయతీలో సోమవారం. గ్రామసభ కార్యక్రమం స్థానిక సర్పంచ్ వూర వెం కటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అధికారులు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ అధికారులు వచ్చే వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కార్యదర్శి శంకరయ్యకు సూచించారు. విద్యుత్తు శాఖ అధికారులు పలు ఇండ్ల మీద ఉన్నటు వంటి కరెంటు తీగలను తొలగించాలని గ్రామంలో ఉన్న విద్యుత్ ని యాంత్రికను తొలగించి ఊరు చివర ఏర్పాటు చేయాలని, అదే విధంగా ఉపాధిహామీ పనిలో మట్టి రోడ్డు ఏర్పాటు చేయాలని, గొంతమ్మ జాతరను ఏర్పాటుపై పాలకవర్గం, గ్రామస్తుల సహకారంతో స్థానిక మంత్రి, కలెక్టర్ దగ్గరికి వెళ్తానని ఆయన అన్నారు. ముఖ్యంగా గ్రామంలో ప్రతి సమస్య ఉన్న నిరంతరం ప్రజల కోసమే పని చేస్తానని అన్నారు. అ దేవిధంగా నూతన పింఛన్ల విషయంలో సంబంధిత అధికారులతో కలిసి మాట్లాడతాను అని అన్నారు. గ్రామంలో ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని అని అ న్నారు. సమావేశానికి వచ్చిన గ్రామ స్థాయి అధికారు లందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కె ట్ డైరెక్టర్ మహేష్,తిరు పతిరావు. ఉపసర్పంచ్ బియ్యన రాజయ్య.వార్డు సభ్యులు జక్కుల మహేందర్.గుంటి అ శోక్.మెండ లక్ష్మి.విద్యుత్ శాఖ లైన్మెన్ శ్రీనివాస్.ఏఈఓ రాజ న్న.అంగన్వాడి టీచర్లు బి.జ్యోతి, జి.జ్యోతి, శశిరేఖ, ఏ.ఎన్.ఎం.సుజాత, ఆశ.వి.వో ఏ.శిరీష, కా రోబార్ మెండ మల్లేష్ తో పాటు గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News