Tuesday, 15 September 2026 04:35:31 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఏ మాఫియా కోసం చెక్ డ్యాంలను నిర్మించారో విచారణలో బయటకు వస్తుంది

ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

Date : 23 December 2025 08:11 PM Views : 302

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : నాణ్యత లేకుండా చెక్ డ్యాంలో నిర్మాణాలు ఎవరి సహకారంతో ఏ మాఫియా కమీషన్ల కోసం నిర్మించారొ విజిలెన్స్ ఎంక్వయిరీలో త్వరలోనే బయటకు వస్తుందని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. మంథని మండలం అడవిసోమన్పల్లి మానేరు వద్ద కుంగిపోయిన చెక్ డ్యాంను మంగళవారం శ్రీధర్ బాబు పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీధర్ బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో శాసన సభ్యునిగా ప్రతిపక్షంలో ఉండగా చెక్ డ్యాంల నిర్మాణాలతో ఈ ప్రాంతంలోని రైతులకు మేలు జరగడంలేదని శాసనసభలో ప్రశ్నించానని గుర్తు చేశారు. నాణ్యత లేకుండా చెక్ డ్యాంల నిర్మాణాలు చేశారనడానికి పగుళ్లే ఎందుకు నిలువెత్తు సాక్ష్యమన్నారు. చెక్ డ్యామ్ కింది నుండి నీరు పోతుందని దీంతో పెద్ద ఎత్తున ప్రమాదం పొంచి ఉందని గ్రామ పెద్దలు చెప్పిన మాటలు బిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. చెక్ డ్యాంల నాణ్యత లోపంపై రాజీ పడేదిలేదని, నిర్మాణాలు జరిగిన నాటి నుండి సంఘటన జరిగిన రోజు వరకు ప్రతి అంశాన్ని అన్ని కోణాల్లో విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నిర్మాణాలు ఎవరి లాభం కోసం ఎందుకు కట్టారని విషయాన్ని త్వరలో బట్టబయలు చేస్తామన్నారు. మంత్రి వెంట ఏఎంసీ చైర్మన్ కొడుదుల వెంకన్న, విద్యుత్తు సలహా మండలి సభ్యుడు శశిభూషణ్ కాచే, పిఎసిఎస్ మాజీ చైర్మన్ కొత్త శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :