ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి అజీజ్ శుక్రవారం ఇంటింటిని విస్తృతంగా పర్యటించి ప్రచారం నిర్వహించారు.12వ వార్డులోని శివాలయం బజార, గుండెపుడి రోడ్డు, ఎర్రగడ్డ బజార్ లో ప్రజలను నేరుగా కలుస్తూ తనకు మద్దతు తెలపాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా డోర్నకల్ ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ ప్రమీల రామచంద్రు నాయాక్ మాట్లాడుతూ.. డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రునాయక్ సారధ్యంలో వారి సూచనలతో 12వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తామని తమను భారీ మెజార్టీతో గెలిపించాలని12వ వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వార్డులో ఉన్న ప్రజా సమస్యలను తమ సొంత సమస్యలుగా భావించి ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, ఇంటింటికి సన్న బియ్యం, రైతు భరోసా, ఇందిరమ్మ చీరలు, కళ్యాణ లక్ష్మి, రైతులకు 2 లక్షల రుణమాఫీ, క్వింటాకు 500 రూపాయల బోనస్, వంటి పథకాలు అద్భుతంగా అమలవుతున్నాయని, ఈ అభివృద్ధిని చూసి కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. వారి వెంట పట్టణ అధ్యక్షులు తాజుద్దీన్, జిల్లా మైనార్టీ నాయకులు అప్సర్, దేవరశెట్టి కృష్ణమూర్తి, సాల్మన్, లింగమూర్తి, అశోక్, మహిళా కార్యకర్తలు సుభద్ర, నరస్సమ్మ, దేవరశెట్టి ధనమ్మ, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News