Tuesday, 28 July 2026 11:43:57 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

రాజీమార్గమే రాజ మార్గం

Date : 16 November 2025 08:16 AM Views : 232

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : క్షనికావేశంలో ప్రతి మనిషి తప్పు చేయడం సహజమని అలాంటప్పుడు వాటిని సర్దించుకోవడం వల్ల రాజీమార్గమే రాజమార్గం అవుతుందని జూనియర్ సివిల్ జడ్జి సాయికిరణ్ కాసమల్ల తెలిపారు. శనివారం జాతీయ న్యాయసేవ అధికార సంస్థ ఆదేశానుసారం స్థానిక న్యాయస్థానంలో స్థానికజాతీయ ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి .సాయికిరణ్ కాసమల మాట్లాడుతూ క్షణికావేశానికి లోనై చేసే అపరాధాలను రాజీపడడం ద్వారా ఇరుపక్షాల కక్షిదారులు తమ కేసులనుండి సివిల్ క్రిమినల్ కేసులనుండి విముక్తి పొందొచ్చు నన్నారు. ఒకసారి చేసిన తప్పును మరోసారి చేయకుండా జాగ్రత్త పడాలన్నారు. క్షణికావేశం వల్ల కుటుంబ సభ్యులు దూరమవడంతో పాటు మానసిక వేదనకు గురికావాల్సి వస్తుందన్నారు. లక్షెట్టిపేట కోర్టు లో 300 కి పైగా కేసులు రాజీ పడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గాండ్ల సత్యనారాయణ,లోక్ అదాలత్ మెంబర్ కోమిరెడ్డి సత్తన్న,బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిఎస్. ప్రదీప్ కుమార్ సీనియర్ న్యాయవాదులు రాజేశ్వర్ రావు, కారుకూరి సురేందర్, గడికొప్పుల కిరణ్ కుమార్,నగూరు రవీందర్, పద్మ,సత్యగౌడ్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :