ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : క్షనికావేశంలో ప్రతి మనిషి తప్పు చేయడం సహజమని అలాంటప్పుడు వాటిని సర్దించుకోవడం వల్ల రాజీమార్గమే రాజమార్గం అవుతుందని జూనియర్ సివిల్ జడ్జి సాయికిరణ్ కాసమల్ల తెలిపారు. శనివారం జాతీయ న్యాయసేవ అధికార సంస్థ ఆదేశానుసారం స్థానిక న్యాయస్థానంలో స్థానికజాతీయ ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి .సాయికిరణ్ కాసమల మాట్లాడుతూ క్షణికావేశానికి లోనై చేసే అపరాధాలను రాజీపడడం ద్వారా ఇరుపక్షాల కక్షిదారులు తమ కేసులనుండి సివిల్ క్రిమినల్ కేసులనుండి విముక్తి పొందొచ్చు నన్నారు. ఒకసారి చేసిన తప్పును మరోసారి చేయకుండా జాగ్రత్త పడాలన్నారు. క్షణికావేశం వల్ల కుటుంబ సభ్యులు దూరమవడంతో పాటు మానసిక వేదనకు గురికావాల్సి వస్తుందన్నారు. లక్షెట్టిపేట కోర్టు లో 300 కి పైగా కేసులు రాజీ పడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గాండ్ల సత్యనారాయణ,లోక్ అదాలత్ మెంబర్ కోమిరెడ్డి సత్తన్న,బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిఎస్. ప్రదీప్ కుమార్ సీనియర్ న్యాయవాదులు రాజేశ్వర్ రావు, కారుకూరి సురేందర్, గడికొప్పుల కిరణ్ కుమార్,నగూరు రవీందర్, పద్మ,సత్యగౌడ్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News