Saturday, 13 June 2026 02:23:07 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

మరిపెడ పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి

ఎమ్మెల్యే రామచంద్రునాయక్

Date : 08 February 2026 01:36 PM Views : 130

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ ఆధ్వర్యంలో విస్తృత ఎన్నికల ప్రచారం జరిగింది. మరిపెడ మున్సిపాలిటీ 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోడి రవి తరఫున ఆయన ప్రజలను కలుసుకుంటూ మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. జాటోత్ రామచంద్రు నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, నూతన రేషన్ కార్డుల పంపిణీ, సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు. మరిపెడ పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరుతూ, మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. స్థానిక సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ప్రజలు పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వంటికొమ్ము యుగంధర్ రెడ్డి, స్నేహా యూత్ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ యువ జిల్లా నాయకులు నూకల అభినవ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్, మాజీ సర్పంచ్ పానుగోతు రాంలాల్, షేక్ అఫ్జల్, మాజీ ఎంపీటీసీ గంధసిరి అంబరీష, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ సర్వర్ భాయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి కాంగ్రెస్ అభ్యర్థి బోడి రవికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మరిపెడ పట్టణ ప్రజల నుండి కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన లభిస్తున్నట్లు నాయకులు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :