Monday, 02 March 2026 04:58:09 PM
# మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం... # విద్యార్థుల సంక్షేమం, విద్యాభ్యాసానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం... # రక్తం దానం చేసిన కాంగ్రెస్ యువ నాయకుడు బీరెల్లి రజిని కుమార్ # మాదిగ అమరవీరులకు ఘన నివాళులు # బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి # భూపాలపల్లి పట్టణ అభివృ ద్ధికి సమగ్ర చర్యలు తీసు కోవాలి # దొంగ నోట్ల చెలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ తెలంగాణ చీఫ్ బ్యూరో # ఇంటర్మీడియట్ పరీక్షల సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్... # జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా శ్రీనివాస్ రావు బాధ్యతల స్వీకరణ... # సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ # ఘనంగా అయిదవ సైన్స్ ఫెయిర్ వార్షికోత్సవ వేడుకలు.. # విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.. # నకిలీ గోల్డ్ బి స్కెట్లు ఇచ్చి.. కిలో అసలుతో బంగారు నగలు తో పరారీ... # ప్రతాపసింగారంలో స్పాట్‌లైట్ క్రికెట్ మైదానం ప్రారంభించిన మంత్రి జీ. వివేక్... # రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీఎంకు విద్యా కమిషన్ నివేదిక # మార్చిలో 18 రోజులు బ్యాంకులు బంద్.. # 103 కిలోల బరువున్నా మహిళకు విజయవంతమైన శస్త్ర చికిత్స # జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులపై హైకోర్టులో విచారణ.. ఏప్రిల్30 వరకు గడువు పొడిగింపు.. # గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలి... # పేదింటి ఆడబిడ్డ పెళ్లికి వరంలా కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం...

కాకా వెంకటస్వామి మెమోరియల్ టి -20 లీగ్ మ్యాచ్‌ను ప్రారంభించిన ఎంపీ

Date : 15 January 2026 09:04 PM Views : 101

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్‌పర్సన్ నిర్మల జగ్గా రెడ్డితో కలిసి, కాకా వెంకటస్వామి మెమోరియల్ టీ 20 క్రికెట్ లీగ్‌లో భాగంగా ఆదిలాబాద్ – ఖమ్మం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ టోర్నమెంట్‌ను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, సంగారెడ్డి జిల్లా – సంగారెడ్డి నియోజకవర్గ పరిధిలోని చిమల్దారి కోనాపూర్ గ్రామంలో ఉన్న క్రికెట్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ యువతలో క్రీడల ద్వారా క్రమశిక్షణ, జట్టు స్పూర్తి, ఆరోగ్యకరమైన పోటీ భావన పెంపొందుతాయని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా జిల్లా స్థాయి క్రీడా ప్రతిభను వెలికితీయడంలో ఇలాంటి టోర్నమెంట్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొంటూ, టోర్నమెంట్ నిర్వాహకులను అభినందించారు. కాకా వెంకటస్వామి మెమోరియల్ టి 20 లీగ్ యువతను క్రీడల వైపు ఆకర్షించి రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని మరింత బలోపేతం చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ, పాల్గొంటున్న అన్ని జట్ల ఆటగాళ్లకు ఎంపీ గడ్డం వంశీ కృష్ణ, టి జి ఐ సి సి చైర్‌పర్సన్ నిర్మల జగ్గా రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ అధికారులు, నిర్వాహకులు, క్రీడాభిమానులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :