Wednesday, 29 July 2026 02:35:01 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

రామగుండంలో ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణ ఏర్పాట్లు

ఎంపీ గడ్డం వంశీకృష్ణ

Date : 01 December 2025 08:47 PM Views : 224

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : రామగుండం ప్రాంతంలో ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ ఏర్పాటు కోసం గత రెండు సంవత్సరాలుగా జరుపుతున్న కృషిని మరో ముందడుగుకు తీసుకెళ్లినట్లు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం తెలిపారు. విషయం పై అనేకసార్లు సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు ని ప్రత్యక్షంగా కలిసి మాట్లాడిన విషయాన్ని ఎంపీ గుర్తుచేశారు. మొదట ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిశీలించిన సైట్‌లో కొండలు ఉండటం, అడ్డంకులు ఉండటం వల్ల వారు ఆ లొకేషన్‌ను రిజెక్ట్ చేశారన్నారు. మేము మళ్లీ వారిని ఒత్తిడి చేసి, ప్రీ-ఫీజిబిలిటీ స్టడీని కొత్త లొకేషన్‌పై నిర్వహించేలా చర్యలు తీసుకున్నా మన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రూ. 50 లక్షలు ప్రీ-ఫీజిబిలిటీ స్టడీ కోసం సెంటర్‌కు చెల్లించినట్లు ఎంపీ తెలిపారు. ఈ స్టడీని వేగవంతం చేయడానికి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీలో మంత్రి రామ్మోహన్ నాయుడును మరోసారి కలిసి చర్చలు జరిపినట్లు వంశీకృష్ణ వెల్లడించారు. వారు నాకు హామీ ఇచ్చారన్నారు. డిసెంబర్ 3 లేదా 4 తేదీలలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టీమ్ రామగుండం ప్రాంతాన్ని సందర్శించి, కొత్త ల్యాండ్ సర్వే చేస్తుం దన్నారు. ప్రీ-ఫీజిబిలిటీ స్టడీ పూర్తయ్యాక భూసేకరణ, తుది నిర్ణయాలకు వెళ్లే అవకాశం ఉంటుంది," అని ఎంపీ చెప్పారు. ఎయిర్పోర్ట్ స్థాపన వల్ల రామగుండం, సింగరేణి ప్రాంతం, పెద్దపల్లి, ఆదిలాబాద్ మంచిర్యాల, జిల్లాలు సహా మొత్తం పరిసర ప్రాంతాల అభివృద్ధికి ఎంతో మేలు జరుగుతుందని ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ఇది ఒక భారీ ఆర్థిక బారమనిఅవకాశాన్ని తీసుకొస్తుం దని అందరూ సహకరించా లన్నారు. మీ ఆశీర్వాదంతో రామగుండంలో ఎయిర్‌పోర్ట్ వచ్చేవరకు నేను నిరంతరం కృషి చేస్తానని ఎంపీ తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :