ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : సీఎం రేవంత్ రెడ్డి పై బిఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు .కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ఎర్రవల్లి లోని ఫాంహౌస్లో బీఆర్ఎస్ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ చర్చించారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడు తూ రేవంత్ రెడ్డి నైతిక విలువ లేకుండా మాట్లాడు తున్నాడని పాలన చేతకాక నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన అట్టర్ ప్లాప్ అని అభివర్ణించారు. కాంగ్రెస్ ది థర్డ్ క్లాస్ పాలన అని విమర్శించారు. శాసనసభలో మండలిలో జరిగే ప్రతి చర్చలో పాల్గొ నాలని ఆదేశించారు. ఎవ్వరు అసెంబ్లీ సమావేశాలను లైట్గా తీసుకోవద్దని మార్గనిర్దేశం చేశారు. స్పీకర్ వైఖరిపై బీఆర్ ఎస్ఎల్పీ సమావేశం లో చర్చించాలని కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు 15 నుంచి 20 రోజులు నిర్వహిం చేలా బీఏసీ సమా వేశంలో పట్టుబట్టా లని గులాబీ నేతలకు కేసీఆర్ సూచించారు. కాంగ్రెస్ ప్రభు త్వంపై ప్రజలు కోపంగా ఉన్నారని తెలిపారు . త్వర లోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు చేస్తానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో వందశాతం తాము అధికారంలోకి వస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇది సర్వభ్రష్ఠ ప్రభుత్వ మని విమర్శించారు. కాంగ్రెస్ హామీలను చూసి ప్రజలు మోస పోయారని అన్నారు. ప్రజలకు ఎవరెంటో అర్థమైందని చెప్పారు. నదీ జలాల వాటాల విషయంలో అవసర మైతే యుద్ధమే చేస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోవ డం ఖాయమని అర్థమైందని అందుకే మంత్రులు ఎమ్మెల్యే లు దోపిడీ చేస్తున్నా రని ఆరోపించారు.
Admin
E Nivas News