ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ఘటనల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలనుయజమానులకు అప్పగించడానికి నిర్ణయించినట్లు సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. పలు కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను హనుమకొండ భీమారం, సి.ఆర్ పి. ఎఫ్ కేంద్రంలో భద్రపర్చారు. వాటిని పోలీస్ స్టేషన్ల వారిగా గుర్తించి సబంధిత వాహనయజమానులకు నోటీసులు కూడా పంపారు. తగిన ఆధారాలతో వచ్చిన యజమానులకు వాహ నాలను తిరిగి అంద జేయనున్నారు. మరింత సమాచారం కోసం సిసి ఆర్ బి ఏసీపీ డేవిడ్ రాజ్ సంప్రదించండి లేదా యం. టి. ఓ రిజర్వ్ ఇన్స్ స్పెక్టర్ శ్రీధర్ ,8712685158, సిసి ఆర్.బి ఇన్స్ స్పెక్టర్ మల్లయ్య 8008389789 నంబర్లను సంప్రదించాలని పోలీస్ కమిషనర్ తెలిపారు.
Admin
E Nivas News