ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : జిల్లాలో జల సంరక్షణకు చేసిన కృషిగాను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా జాతీయ పురస్కారాన్ని అందుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షా ను యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆ విభాగం నాయకులు కలెక్టర్ ను శాలువాతో సత్కరించారు. మిఠాయిలను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ అవార్డుతో జాతీయస్థాయిలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకు వచ్చారని జిల్లాకు ఎంతో గర్వకారణమని కలెక్టర్ కృషిని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బేల మండల అధ్యక్షుడు ఫైజుల్లా ఖాన్, యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల నాగరాజు, మల్లారెడ్డి, వెంకటేష్, తదితరులు ఉన్నారు.
Admin
E Nivas News