ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్లోని సర్వే నంబర్ 60లో ఉన్న 350 గజాల స్థలం చుట్టూ ఉన్న ప్రహరీ గోడను, వాచ్మన్ గదిని హైడ్రా కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ పెమ్మసాని సుధారాణి దాఖలు చేసింది. కూల్చివేతల సమయంలో ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, హైడ్రా దాఖలు చేసిన కౌంటర్లో కూడా నోటీసు ఇచ్చినట్టు ఎక్కడా లేదని కోర్టుకు పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం ఏంటిని నోటీసులు ఇస్తే కోర్టుకు వస్తారని, నోటీసులు ఇవ్వకుండారాత్రికిరాత్రే కూల్చేస్తున్నారా ప్రజలకు కోర్టుకు వచ్చే అవకాశం కూడా లేదా అంటూ రెవెన్యూ అధికారులపై, హైడ్రాపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అసలు ఆ భూమి ప్రభుత్వ స్థలంలో ఉందని ఎవరు నిర్ధారించారని న్యాయమూర్తి ప్రశ్నించగా, గతంలో తన స్థానంలో ఉన్న ఎమ్మార్వోనిర్ధారించాడని తెలిపిన ప్రస్తుత ఎమ్మార్వోదీంతో ప్రభుత్వ భూమిగా నిర్ధారించిన ఎమ్మార్వో పూర్తి రికార్డులతో కోర్టులో హాజరు కావాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను 11వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.
Admin
E Nivas News