ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల కేంద్ర మాజీ సర్పంచ్ లింబాజిబోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో మంగళవారం సొంత గూడు బీఆర్ఎస్ పార్టీలో చేరుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ సర్పంచ్ మడావి లింబాజి నెరడిగొండ మండల కేంద్రంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ నివాసానికి 100 మందితో వచ్చారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మడావి లింబాజి మాట్లాడుతూ అవినీతికే పరిమితమైన కాంగ్రెస్ పార్టీలో ఉండలేనని, గిరిజన గూడలను పంచాయతీలుగా చేసిన కేసీఆర్ వెంటే ఉంటామని, ప్రతిపక్ష ఎమ్మెల్యే అయిన బోథ్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాడుతున్న ఎమ్మెల్యే అడుగుజాడల్లో నడవడానికే పార్టీలో చేరడం జరిగిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పెట్టె ప్రలోభాలకు బీఆర్ఎస్ కార్యకర్తలు మోసపోవద్దని, కేసీఆర్ తిరిగి వచ్చారని, మంచి రోజులు రబోతున్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నాగయ్య, మాజీ జడ్పీటీసీ సుధాకర్, మాజీ ఎంపీపీ సంతోష్, నాయకులు కెమ శ్రీకాంత్, మాజీ సర్పంచ్ గంగయ్య, నితిన్ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News