ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : సింగరేణి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కార్మికుల హక్కుల కోసం పోరాడుతామని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. బుధవారంసింగరేణి పరిరక్షణ సదస్సులో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు.మంచిర్యాలజిల్లాలో నిర్వహించిన సింగరేణి పరిరక్షణ సదస్సులో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ కబంధహస్తాల్లో సింగరేణి మాయమయ్యేలా కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులంతా ఐక్యంగా ఉంటేనే తమ అనుకున్న తప్పులు సాధించగలుగుతామని సింగరేణిని కాపాడుకుంటామని సూచించారు.సింగరేణి పరిరక్షణ, కార్మికుల సంక్షేమంపై తదితర అంశాలపై చర్చించారు. సింగరేణి సంస్థను పరిరక్షించాల్సిన అవసరం, కార్మికుల హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై నాయకులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సదస్సులో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య, కార్మికులు, ప్రజలు, పార్టీ నాయకులు హాజరయ్యారు.
Admin
E Nivas News