ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మమత (30)ను 14 నెలల కిందట తాండూరు మండలం చంద్రుపల్లి కి చెందిన కుంబాల నరేష్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. కాగా ఈ నెల 17న నిద్రమత్తులో మెట్లపై ప్రమాదవశాత్తు జారిపడ్డ నరేష్ తలకు తీవ్ర గాయం కావడంతో కరీంనగర్లో ఆసుపత్రికి తరలించారు. నరేష్ను పరీక్షించి శస్త్రచికిత్స చేసినా జీవచ్ఛవంలా ఉంటాడని డాక్టర్లు తెలిపారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై మమత అదే రోజు రాత్రి కరీంనగర్ తీగలగుట్టపల్లి రైల్వేట్రాక్ సమీపంలో ఒంటిపై పెట్రోలు పోసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం నరేష్ మరణించాడు. ఆరు రోజుల వ్యవధిలో భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
Admin
E Nivas News