ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో వెలసిన మెస్రం వంశీయుల ఆరాధ్య దైవమైన శ్రీ నాగోబా దేవాలయాన్ని సోమవారం దర్శించుకుని తెలంగాణ రాష్ట్ర ఎస్సి, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య తెలంగాణ రాష్ట్ర ఎస్సి,ఎస్టీ కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్,కుర్సం నీలాదేవి ,రాంబాబు నాయక్ ,కొంకటి లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ సభ్యులు వారిని ఘనంగా సత్కరించి నాగదేవత చిత్రాన్ని అందించారు.ఈ సందర్బంగా రేణి కుంట్ల ప్రవీణ్ మాట్లాడుతూ నాగోబా జాతర సందర్భంగా ఆదివాసీ సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ,దేవుని ఆశీస్సులతో ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని కోరుకున్నట్లు తెలిపారు.
Admin
E Nivas News