ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలోని ప్రాజెక్టుల సాధన కోసం త్వరలో పాద యాత్ర చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు . నా వెంట వచ్చేవాళ్ళు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.సంగారెడ్డి ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం త్వరలోనే తాను సంగమేశ్వర-బసవేశ్వర ఎత్తిపోతల ప్రాజెక్టు ను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ భారీ పాదయాత్ర చేపడతానని మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. బుధవారం ఆదోలు లోని లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్ లో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు, ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గత రెండేళ్లుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లబ్ధిదారులకు ఇవ్వ కుండా పెండింగ్ లో పెట్టారని, ఇలా పథకాలు అమలు చేయకుండా ఇందిరమ్మ పేరును కాంగ్రెస్ నాయకులే చెడగొడుతున్నారని విమర్శించారు. రేపు భూమి బద్దలైనా రేవంత్ రెడ్డి తలకిందు లుగా తపస్సు చేసినాఆఖరికి భూకంపం వచ్చినా సరేతెలంగాణలో మళ్లీ వచ్చేది కచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విచ్చలవిడి గా అవినీతి జరుగు తోందని ఆరోపిస్తూ ప్రభుత్వ గురుకుల పాఠశాలల టెండర్లలో ముగ్గురు కాంగ్రెస్ మంత్రులు కలిసి భారీ స్కామ్కు పాల్పడ్డారని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా ఎప్పటికీ మావంటే ఉన్నారని మళ్ళీ మా ప్రభుత్వం వచ్చాకే పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోరికలన్నీ తీర్చడం మాకే సాధ్యమవుతుందా అన్నారు.
Admin
E Nivas News