ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామంలో తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ కరీంనగర్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్, జిల్లా పశు వైద్య పశు సంవర్దక శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంథని మండలం విలోచవరం గ్రామంలో ప్రత్యేక పశువైద్య శిబిరం నిర్వహించినట్లు మంథని మండల పశువైద్య అధికారి డాక్టర్ టి.రవి కుమార్ పేర్కొన్నారు. ఈ పశు వైద్య శిభిరంలో జబ్బు పడిన 53 పశువులకు చికిత్స అందించి 112 పశువులకు వ్యాధి నిరోధక టీకాలు (ముద్ద చర్మ వ్యాధి మరియు రేబిస్ టీకాలు), 23 పశువులకు చూడి పరీక్షలు, రెండు పశువులకు గర్భకోష వ్యాధులకు చికిత్స, 32 దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. 70% సబ్సిడీ గడ్డి జోన్నల పంపిని, పాడి పశువుల, జీవాల వేసవితాప ఉపశమన యజమాన్య పద్దతులు, పశుపోషణ, వివిధ రకాల పశు గ్రాసాల సాగు పై పాడి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా జిల్లా ఇన్చార్జ్ పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె.వేణుగోపాల్, సర్పంచ్ కొండ ప్రేమలత - రవీందర్, సహాయక సిబ్బందితో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు వెటర్నరీ లైవ్ స్టాక్ సహాయకులు వెంకన్న, వాక్సీ నెటర్ అజయ్, గోపాల మిత్రలు బుద్దర్తి మల్లేష్, పానుగంటి సంజీవ్ కుమార్, కొండయ్య, రామకృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.
Admin
E Nivas News