ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ఏలాంటి ఆధారాలు లేకుండా తమ సొసైటీ (సమితి) పై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని మదర్ తెరిసా మహిళ పొదుపు సమితి ఛైర్మన్ మాదేశి పద్మ పేర్కొన్నారు. శనివారం మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ (డబ్ల్యు జే)లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ మంథనిలో కొనసాగుతున్న మదర్ థెరిస్సా సహకార సమైక్య పొదుపు సంఘంపై నామని హరీష్ చేసిన ఆరోపణలను ఖండించారు. సొసైటీ మహిళలకు అమ్మలాంటిదని, మహిళల ఆర్థికాభివృద్ధి కోసం పారదర్శకంగా పనిచేస్తోందని, నామని హరీష్ తల్లి గౌరమ్మ సొసైటీ నుంచి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించాలని పలుమార్లు కోరినప్పటికీ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. రుణం చెల్లించకుండా ఉండేందుకు సొసైటీపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అధిక వడ్డీలు, వడ్డీపై వడ్డీలు వసూలు చేస్తున్నామన్న ప్రచారంలో వాస్తవం లేదని సొసైటీకి సంబంధించిన ప్రతి లావాదేవీని రిజిస్టర్లలో నమోదు చేస్తున్నామని, 2022 నుంచి తమ కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని స్పష్టం చెశారు. సొసైటీ కార్యకలాపాలపై ఏవైనా సందేహాలు ఉంటే కార్యాలయానికి వచ్చి సంబంధిత రికార్డులను పరిశీలించి నివృత్తి చేసుకోవచ్చన్నారు. ఇప్పటికే హరీష్ కోరిన సమాచారాన్ని సొసైటీ లెటర్హెడ్పై అధికారికంగా అందజేశామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. సొసైటీని రచ్చకీడ్చేలా, అప్రతిష్టపాలు చేసేలా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని హెచ్చరించారు. బ్లాక్మెయిల్, బెదిరింపులకు తాము భయపడబోమని, సొసైటీ ప్రారంభమైననాటి నుంచి నేటి వరకు జరిగిన లావాదేవీలకు సంబంధించిన పూర్తి సమాచారం రిజిస్టార్లలో నమోదు చేసి ఉందని మేనేజర్ మేకల మల్లేశం తెలిపారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు నామని సుగుణ, తాత మధునమ్మ, ముప్పిడి మల్లేశ్వరి, ఎలగందుల సరిత, పుల్లె రాజేశ్వరి, పుల్లే లక్ష్మి, కొండ కనకమ్మ, కట్కూరి శోభ, మాడం రమాదేవి, మాచిడి సమ్మక్క తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News