ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాల, కళాశాలలో శుక్రవారం బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సిహెచ్.మంగ మహిళా ఉపాధ్యాయ సిబ్బందితో కలిసి బోనమెత్తుకొని పోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం మేక తోపాటు కోడిని బలి ఇచ్చి నైవేద్యం సమర్పించారు. అనంతరం ప్రిన్సిపల్ సిహెచ్. మంగ మాట్లాడుతూ తమ పాఠశాలలోని పిల్లలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, అప్పుడే శ్రద్ధతో విద్యను అభ్యసిస్తారన్నారు. ఈ నేపథ్యంలో తమ పాఠశాల వైపు ఎలాంటి దుష్టశక్తుల కన్ను పడవద్దని ఉద్దేశంతోనే అమ్మవార్లకు బోనం సమర్పించినట్లు తెలిపారు . ఈ సందర్భంగా విద్యార్థులు బ్యాండ్ మేళాలతో అమ్మవారి వద్దకు బోనం తీసుకు వస్తున్న సమయంలో పోతరాజు వేషధారణలో నృత్యాలు చేస్తూ తీసుకువెళ్లారు. అంతేకాకుండా ఉపాధ్యాయ సిబ్బంది సైతం ఆనందోత్సాహాల మధ్య నృత్యాలు చేస్తూ బోనాలవేడుకను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులు సహపంక్తి భోజనం చేశారు.
Admin
E Nivas News