ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రంలో పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు . మంగళవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండల కేంద్రంలోని పాత మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, నామినేషన్, డిస్ట్రిబ్యూషన్, కౌంటింగ్ కేంద్రాలను లక్షెట్టిపేట మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, మండల తహసిల్దార్ దిలీప్ కుమార్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రంలో అవసరమైన పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, నామినేషన్, పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలను ఎన్నికల నిబంధనలకు లోబడి పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో చేపట్టిన పోస్ట్ మార్టం కేంద్రం నిర్మాణ పనులను తెలంగాణ వైద్య విధాన పరిషత్ అధికారి కోటేశ్వర్ తో కలిసి పరిశీలించి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలోని వార్డులు, ల్యాబ్, ఓ. పి., రిజిస్టర్లు, పారిశుద్ధ్య పనుల నిర్వహణను పరిశీలించారు. అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలని, పారిశుద్ధ్య నిర్వహణ పక్క బందీగా చేపట్టాలని తెలిపారు. ఆసుపత్రిలోని రోగులతో మాట్లాడుతూ వారికి అందిస్తున్న సౌకర్యాలు, ఆహారం, వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులుపాల్గొన్నారు.
Admin
E Nivas News