ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరాన గిరిజనుల ఆరాధ్య దైవమైన పద్మల్ పూరి కాకో అమ్మవారిని ఆదివారం నాడు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు గిరిజన పూజారులతో పాటు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. గిరిజన పూజారులు ముందుగా మాజీ ఎమ్మెల్యే కు తలపాగా పెట్టిన అనంతరం అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి మొక్కులు అప్పచెప్పుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ హయాంలోనే నిధులు కేటాయించడం జరిగిందని ఇక్కడ దేవాలయం కూడా నిర్మించిన ఘనత మాకే దక్కిందన్నారు. అంతేకాకుండా ప్రతి యేటా కార్తీక్ మాసం రాగానే 10 రోజులపాటు గిరిజనులు ఆదివాసీలు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పోషించుకోవడం చాలా హర్షించదగ్గ విషయం అన్నారు. ఆదివాసీలు ఈ పది రోజులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఇక్కడే ఉండి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ నైవేద్యాలు వడ్డిస్తూ వారి యొక్క భజనలు చేస్తారని తెలిపారు. వారి పూజల ఫలితంగానే ప్రజలను కూడా అమ్మవారు చల్లగా చూస్తారని ఆయన అన్నారు. అనంతరం తమ ప్రభుత్వం వచ్చాక మరింత అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి విజిత్ రావు, మాజీ వైస్ ఎంపీపీ అనిల్ స్థానిక తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News