ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మేయర్, మున్సిపల్ శుక్రవారం వెలువడిన ఫలితాలలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. దాదాపుగా 70 శాతం కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులే గెలిచి మేయర్ స్థానాలతో పాటు పురపాలక స్థానాలను కూడా కైవసం చేసుకున్నారు. బారాస పార్టీ రెండో స్థానంలోనే ఉండగా బిజెపి మూడో స్థానం నిలబెట్టుకుంది. అంతేకాకుండా ఎక్కువ శాతం ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గిరాకీ పెరిగింది. చాలా వరకు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ టిఆర్ఎస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు సమానంగా స్థానాలురాగా ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా చోట్ల కాంగ్రెస్ టిఆర్ఎస్ నాయకులు గొడవలు కూడా జరిగాయి. ఇండిపెండెంట్ అభ్యర్థులను తమ వాహనాలను తరలిస్తుండగా గొడవ జరుగుతుండడంతో పోలీసులు జోక్యం చేసుకొని వారిని చదరగొట్టారు. కరీంనగర్ కార్పొరేషన్ స్థానాన్ని బిజెపికైవసంచేసుకుంది. దీంతో కరీంనగర్లో కేంద్రమంత్రి బండి సంజయ్ వర్గీయులు సంబరాలుచేసుకున్నారు. పంచాయతీ ఎన్నికల తరహాలోని బిఆర్ఎస్ తమ సత్తా చాటింది.
Admin
E Nivas News