ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఇటీవల కురిసిన అకాల వర్షాలు నదిపద్యంలో తడిసిన జొన్న గింజలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని ధన్నూర్ గ్రామంలో రైతుల విజ్ఞప్తి మేరకు నేడు జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు ఇప్పటికే చాల నష్టపోయారు సరైన సమయంలో పంటలు కొనుగోలు చేయడం ప్రారంభిస్తే ఈ రోజు ఇన్ని వందల క్వింటల్ల జొన్నలు నీటిపాలు కాకపోయేది అన్నారు. తడిచిన ప్రతి గింజ ఈ ప్రభుత్వం కొనుగోలు చెయాల న్నారు. అదే విధంగా ఇటీవల కాలంలో మా బోథ్ నియోజకవర్గంలో ప్రమాదవశత్తు పంటకాలి నష్టపోయిన రైతులకు తొరగా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా నష్టపరిహారం అందించాలని కోరారు. నియోజకవర్గంలోని ఉన్న అన్ని జొన్న కొనుగోలు కేంద్రాలు నేటి నుంచి మొదలు అవుతాయి అని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమం మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు సంబంధిత శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.
Admin
E Nivas News