Tuesday, 28 July 2026 04:37:56 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి...

రెండు నెలల వేతనంతో పేద కుటుంబాలకు నిత్యవసర సరుకుల పంపిణీ

Date : 27 July 2026 04:04 PM Views : 43

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మంథని పట్టణంలోని 6వ వార్డు కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి కుమార్ తమకు వచ్చిన రెండు నెలల కౌన్సిలర్ వేతనాన్ని బోయిన్‌పేట అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం కోసం వినియోగించారు. ఈ సందర్భంగా బోయిన్‌పేటకు చెందిన నాలుగు నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను గెలిచిన తర్వాత మరచిపోయే నాయకులు ఉన్న ఈ రోజుల్లో, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే ప్రజాప్రతినిధి బాధ్యత అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోతరవేని శ్రీలత క్రాంతి కుమార్ తెలిపారు. రాజకీయ పార్టీల మద్దతు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి, ప్రజల ఆశీర్వాదంతో జిల్లా లోనే భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల కౌన్సిలర్ వేతనాన్ని ప్రజలకే వినియోగిస్తానని ప్రకటించగా, అందులో భాగంగా రెండు నెలల వేతనంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల సహకారం, విశ్వాసంతోనే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి బోయిన్‌పేటను ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :