ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మంథని పట్టణంలోని 6వ వార్డు కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి కుమార్ తమకు వచ్చిన రెండు నెలల కౌన్సిలర్ వేతనాన్ని బోయిన్పేట అభివృద్ధి, పేద ప్రజల సంక్షేమం కోసం వినియోగించారు. ఈ సందర్భంగా బోయిన్పేటకు చెందిన నాలుగు నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను గెలిచిన తర్వాత మరచిపోయే నాయకులు ఉన్న ఈ రోజుల్లో, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే ప్రజాప్రతినిధి బాధ్యత అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోతరవేని శ్రీలత క్రాంతి కుమార్ తెలిపారు. రాజకీయ పార్టీల మద్దతు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి, ప్రజల ఆశీర్వాదంతో జిల్లా లోనే భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల కౌన్సిలర్ వేతనాన్ని ప్రజలకే వినియోగిస్తానని ప్రకటించగా, అందులో భాగంగా రెండు నెలల వేతనంతో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల సహకారం, విశ్వాసంతోనే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి బోయిన్పేటను ఆదర్శవంతమైన ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
Admin
E Nivas News