ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పేద బిడ్డల సంతోషమే మా కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. శుక్రవారం మంచిర్యాల జిల్లామందమర్రి తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేద మరియు మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక భారం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి చేరేలా అధికారులు కృషి చేయాలనిసూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
Admin
E Nivas News