ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జగిత్యాల జిల్లా వైస్ చైర్మన్ పదవిని ఎమ్మార్పీఎస్ నాయకులకు ఇవ్వాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు కు మాదిగలు విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో ఎమ్మార్పీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగాజిల్లా అధ్యక్షులు దుమల గంగారాం మాదిగ మాట్లాడుతూ జగిత్యాల మున్సిపాలిటీ ఏర్పడ్డ నుండి ఇప్పటివరకు దళితులకు చైర్మన్ వైస్ చైర్మన్, కోఆప్షన్ నెంబర్లను కూడా ఇప్పటివరకు కేటాయించకపోవడం చాలా బాధాకరం అన్నారు. అత్యధిక శాతం జగిత్యాల మున్సిపాలిటీ పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ దళితులను ఓటు బ్యాంకుగా చూడడమే తప్ప జగిత్యాల మున్సిపాలిటీలో సమచిత స్థానం తగిన గౌరవం లభించలేదు గత పాలకులు పట్టించుకున్న పాపన్న పోలే ఎప్పటికైనా జగిత్యాల జిల్లా మంత్రిగా దళిత సామాజిక వర్గం నుండి దళితుల పక్షాన ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాదిగ సామాజిక వర్గాన్ని ఆత్మగౌరవంతో జీవించే విధంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని ఎమ్మార్పీఎస్ జగిత్యాల జిల్లా కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు. విషయంలో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డికృషి చేయాలని ఎమ్మార్పీఎస్ పక్షాన ముక్తకంఠంతో కోరుతున్నామన్నారు. తప్పకుండామాదిగలకు రాజకీయంగా జగిత్యాల మున్సిపాలిటీలో ప్రాతినిత్యం కల్పించే విధంగా చర్యలు చేపడతారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్, జగిత్యాల జిల్లా ఉపాధ్యక్షులు బోనగిరి కిషన్, మాదిగ రాష్ట్ర మహిళా నాయకురాలు శ నిగారపు కాంతక్క, మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బొల్లె అనిల్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి సంగెపు ముత్తు మాదిగ, ఎమ్మార్పీఎస్ జగిత్యాల నియోజకవర్గం ఇన్చార్జి బొల్లారపు దివాకర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ కో- కన్వీనర్ పొడిటి సునీల్ మాదిగ లు పాల్గొన్నారు.
Admin
E Nivas News