Tuesday, 28 July 2026 10:22:52 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం

Date : 24 January 2026 08:17 PM Views : 240

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో శనివారం16 వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మహాత్మా సంతోష్ అధ్యక్షతన, రాజనీతి శాస్త్ర విభాగ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి జాతీయ ఓటరు దినోత్సవ అవగాహన ర్యాలీ, ఓటరు ప్రతిజ్ఞ మరియు విద్యార్థుల కు పోటీలు నిర్వహించారు. అనంతరం కళాశాలలో ప్రజాస్వామ్యంలో మహిళా ఓటర్ల పాత్ర అంశంపై విద్యార్థులకు వ్యాసరచన ,వక్తృత్వ మరియు చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లక్షెట్టిపేట తహసిల్దార్ దిలీప్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా తాసిల్దార్ మాట్లాడుతూ ఓటరు అవగాహన కలిగి ఉండటం ముఖ్యమని సూచించారు. ప్రజాస్వామ్యానికి ఓటు ఒక బలం అని పేర్కొన్నారు. అనంతరం తహశీల్దార్ మరియు కలశాల ప్రిన్సిపాల్ చేతుల మీదుగా వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజనీతి శాస్త్ర విభాగ అధిపతి సంధ్యారాణి, కల్చరల్ కోఆర్డినేటర్ డాక్టర్ టి సురేష్, అధ్యాప బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :