ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో శనివారం16 వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మహాత్మా సంతోష్ అధ్యక్షతన, రాజనీతి శాస్త్ర విభాగ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి జాతీయ ఓటరు దినోత్సవ అవగాహన ర్యాలీ, ఓటరు ప్రతిజ్ఞ మరియు విద్యార్థుల కు పోటీలు నిర్వహించారు. అనంతరం కళాశాలలో ప్రజాస్వామ్యంలో మహిళా ఓటర్ల పాత్ర అంశంపై విద్యార్థులకు వ్యాసరచన ,వక్తృత్వ మరియు చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లక్షెట్టిపేట తహసిల్దార్ దిలీప్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్బంగా తాసిల్దార్ మాట్లాడుతూ ఓటరు అవగాహన కలిగి ఉండటం ముఖ్యమని సూచించారు. ప్రజాస్వామ్యానికి ఓటు ఒక బలం అని పేర్కొన్నారు. అనంతరం తహశీల్దార్ మరియు కలశాల ప్రిన్సిపాల్ చేతుల మీదుగా వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజనీతి శాస్త్ర విభాగ అధిపతి సంధ్యారాణి, కల్చరల్ కోఆర్డినేటర్ డాక్టర్ టి సురేష్, అధ్యాప బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News