ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వాసుపత్రిని సోమవారం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పలు వార్డుల్లో కలియ తిరుగుతూ రోగులతో మాట్లాడారు. వైద్యులు అందుబాటులో ఉండి వైద్యం చేస్తున్నారా అలాగే మందులు కూడా ఇస్తున్నారని రోగులని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. పేద ప్రజల వైద్యం అందించడం కోసమే కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఆసుపత్రి నిర్మించామని సరిపడా వైద్య సిబ్బందిని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. అనంతరం వైద్య సిబ్బందికి పలు సలహాలు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బందితోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News