Monday, 14 September 2026 04:20:08 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ఈశ్వర చారి త్యాగం మరువలేనిది

Date : 09 December 2025 08:40 PM Views : 252

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : బీసీ సంఘాల హక్కుల కోసం అమరుడైన ఈశ్వర చారి సేవలు మరువలేనివని బీసీ సంఘాల నాయకులు తెలిపారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం ముందు బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో 12 శుక్రవారం మంచిర్యాల పట్టణంలో బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చేరాల వంశీనిర్వహించే బీసీ హక్కుల కోసం అమరుడైన సాయి ఈశ్వర చారి ఆశయసాధన సభ, విద్యార్థి సంఘాల, కులసంఘాల, ప్రజా సంఘాల, వివిధ రాజకీయ పార్టీల మరియు స్వచ్ఛంద సేవా సంస్థల కవుల, కళాకారుల రౌండ్ టేబుల్ సమావేశంకి సంబదించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగానాయకులు మాట్లాడుతూబీసీల హక్కుల కోసం అమరుడైన సాయి ఈశ్వర చారి త్యాగం మరువలేనిదని, యావత్ బీసీ సమాజం మేర్కోవాల్సిన విషయమాని, వారిని స్మరించుకుంటూ మంచిర్యాల జిల్లాలో సాయి ఈశ్వర చారి ఆశయ సాధన సభ మరియు విద్యార్థి సంఘాల, కులసంఘాల, ప్రజా సంఘాల, వివిధ రాజకీయ పార్టీల మరియు స్వచ్ఛంద సేవా సంస్థల కవుల, కళాకారులతో పార్లమెంట్ శీతకాల సమావేశంలో బీసీ బిల్లును ప్రవేశపెట్టి, రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు చేర్చాలని, ఆది జరగని పక్షంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో ప్రవేట్ బిల్లుగా బీసీ రిజర్వేషన్ల బిల్లునీ ప్రవేశపెట్టాలని, ప్రభుత్వం విడుదల చేసే ఉద్యోగ నోటిఫకేషన్లలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ప్రకారమే నోటిఫికేషన్లు ఇవ్వాలని, అన్ని రాజకీయ పార్టీలో ఉన్న బీసీ మంత్రులు,ఎంపీ,ఏమ్మెల్యే,ఏమ్మెల్సిలు రాజీనామా చేసి బీసీ ఉద్యమమలోకి రావాలని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ఈ కార్యక్రమానికి బీసీ కుల సంఘాల నాయకులు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు, కవులు, కళాకారులు రాజకీయ నాయకులు మేధావులు మద్దతుదారులు, ప్రజలు స్వచ్ఛంద సంస్థలు విచ్చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు నారేడ్ల శ్రీనివాస్, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు తోట రాజేష్, బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేరాల వంశీ, టీవీయూవీ పట్టణ సహాయ కార్యదర్శి ప్రసాద్, బీసీ ఉద్యమ నాయకుడు సమయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :