ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : బీసీ సంఘాల హక్కుల కోసం అమరుడైన ఈశ్వర చారి సేవలు మరువలేనివని బీసీ సంఘాల నాయకులు తెలిపారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం ముందు బీసీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో 12 శుక్రవారం మంచిర్యాల పట్టణంలో బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు చేరాల వంశీనిర్వహించే బీసీ హక్కుల కోసం అమరుడైన సాయి ఈశ్వర చారి ఆశయసాధన సభ, విద్యార్థి సంఘాల, కులసంఘాల, ప్రజా సంఘాల, వివిధ రాజకీయ పార్టీల మరియు స్వచ్ఛంద సేవా సంస్థల కవుల, కళాకారుల రౌండ్ టేబుల్ సమావేశంకి సంబదించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగానాయకులు మాట్లాడుతూబీసీల హక్కుల కోసం అమరుడైన సాయి ఈశ్వర చారి త్యాగం మరువలేనిదని, యావత్ బీసీ సమాజం మేర్కోవాల్సిన విషయమాని, వారిని స్మరించుకుంటూ మంచిర్యాల జిల్లాలో సాయి ఈశ్వర చారి ఆశయ సాధన సభ మరియు విద్యార్థి సంఘాల, కులసంఘాల, ప్రజా సంఘాల, వివిధ రాజకీయ పార్టీల మరియు స్వచ్ఛంద సేవా సంస్థల కవుల, కళాకారులతో పార్లమెంట్ శీతకాల సమావేశంలో బీసీ బిల్లును ప్రవేశపెట్టి, రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లు చేర్చాలని, ఆది జరగని పక్షంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో ప్రవేట్ బిల్లుగా బీసీ రిజర్వేషన్ల బిల్లునీ ప్రవేశపెట్టాలని, ప్రభుత్వం విడుదల చేసే ఉద్యోగ నోటిఫకేషన్లలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ప్రకారమే నోటిఫికేషన్లు ఇవ్వాలని, అన్ని రాజకీయ పార్టీలో ఉన్న బీసీ మంత్రులు,ఎంపీ,ఏమ్మెల్యే,ఏమ్మెల్సిలు రాజీనామా చేసి బీసీ ఉద్యమమలోకి రావాలని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని ఈ కార్యక్రమానికి బీసీ కుల సంఘాల నాయకులు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు, కవులు, కళాకారులు రాజకీయ నాయకులు మేధావులు మద్దతుదారులు, ప్రజలు స్వచ్ఛంద సంస్థలు విచ్చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు నారేడ్ల శ్రీనివాస్, పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు తోట రాజేష్, బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేరాల వంశీ, టీవీయూవీ పట్టణ సహాయ కార్యదర్శి ప్రసాద్, బీసీ ఉద్యమ నాయకుడు సమయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News