Sunday, 21 June 2026 01:30:31 PM
# శ్రీ రామాలయ పునర్ ప్రతిష్ట మహోత్సవాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు # 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు..

బడికి పంపించడానికి నిరాకరిస్తున్న తల్లిదండ్రులు...

Date : 15 June 2026 07:16 AM Views : 29

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : వేసవి సెలవులుముగియడంతో సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈసారి బడిగంట మోగనున్న తొలి రోజు అమావాస్య కావడం చర్చనీయాంశంగా మారింది. అమావాస్య రోజున పిల్లలను పాఠశాలకు పంపడం మంచిది కాదనే అభిప్రాయంతో పలువురు తల్లిదండ్రులు తొలిరోజు పాఠశాలలకు పంపేందుకు వెనుకాడుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 15న పాఠశాలలు ప్రారంభం కానున్నప్పటికీ, అమావాస్య సెంటిమెంట్ కారణంగా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను మంగళవారం లేదా బుధవారం నుంచి మాత్రమే పంపించాలని భావిస్తున్నారు. కొందరు మంగళవారం కూడా కొత్త కార్యక్రమాలకు అనుకూలం కాదనే నమ్మకంతో నేరుగా బుధవారానికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ పాఠశాలలు అదే బాటలో.. అమావాస్య నేపథ్యంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు సైతం విద్యార్థుల హాజరు తక్కువగా ఉండే అవకాశం ఉందని భావించి నేరుగా జూన్ 17 నుంచే తరగతులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు తల్లిదండ్రులకు వాట్సాప్ సందేశాలు పంపుతున్నాయి. శుక్రవారమే పిల్లలను తీసుకెళ్లిన తల్లిదండ్రులు ముందస్తు జాగ్రత్తగా పాఠశాలలు తెరవాల్సిన రోజునే తమ పిల్లలను కొద్దిసేపు స్కూల్‌కు తీసుకెళ్లి తిరిగి తీసుకువచ్చిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో అమావాస్య ప్రభావం ఈసారి విద్యారంగంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రజలు ఆచార సాంప్రదాయాలను పాటిస్తున్నారని అనడంలో సందేహం లేదని విషయం తేట తెల్లమైంది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :