ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మనిషి జీవితంలో మానసిక ప్రశాంతతే అన్నింటికంటే ముఖ్యమైందని వన్నెస్ ట్రైనర్, మంథని అగ్రికల్చర్ ఏడిఏ అంజనీ అన్నారు. మంగళవారం మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో అంజని మిశ్ర మాట్లాడుతూ నేటి సమాజంలో యువత తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. తమ జీవితంలో తీసుకునే నిర్ణయాల్లో ఏర్పడే గందరగోళంతోనే ఇలాంటి పరిస్థితి ఉంటుందన్నారు. ఎప్పుడైతే మానసికంగా ప్రశాంతత అలవాటు అవుతుందో అప్పుడు తాము తీసుకున్న నిర్ణయంపై ఓ అంచనా ఉంటుందని, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఇబ్బందులకు దారి తీస్తాయన్నారు. తల్లిదండ్రులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని వారిని ఇబ్బందులు గురి చేసే విధంగా ప్రవర్తించవద్దని సూచించారు. నిత్యం సాధన ద్వారా మనసును అదుపులో ఉంచే విధంగా ప్రాక్టీస్ చేస్తే ఎంత పెద్ద సమస్యనైనా వెల్నెస్ ట్రీట్మెంట్ ద్వారా పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. కృతజ్ఞత అనేది ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని తమకు సహకరించిన ప్రతి ఒక్కరి పట్ల అదే భావంతో మెలగాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సయ్యద్ సలీం, స్టూడెంట్ కౌన్సిలర్ ఎల్ ఆర్ కే రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News