ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకత్వం బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి బండ కిషోర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల కమల్ లు కోరారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో యూత్ కాంగ్రెస్ మండల, పట్టణ శాఖల అధ్యక్షులు సాదుల శ్రీకాంత్, పెంటరి రాజుల అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన బండ కిషోర్ రెడ్డి నూకల కమల్ లు మాట్లాడుతూ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆదేశానుసారం మండల, పట్టణ కమిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త పాటుపడాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం పాటుపడుతూ ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎరుకల ప్రవీణ్, మంథని మండలంలోని అన్ని గ్రామాల యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News