Monday, 14 September 2026 03:30:04 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు ఇస్తాం...

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Date : 19 March 2026 07:16 AM Views : 153

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలో జర్నలిస్టులకు త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. జర్నలిస్టులను వేరు చేసే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని నిజమైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంచేశారు. బుధవారం శాసనమండలిలో ప్రశ్నొత్తరాల సమయంలో పలువురు విపక్ష సభ్యులు జర్నలిస్టు సమస్యలపై అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. అక్రిడిటేషన్ల విషయంలో ప్రభుత్వం తొలుత 252 జీవోను ఇచ్చిందని అయితే జర్నలిస్టు సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనలతో ఆ జీవోను సవరించి ఇచ్చా మని తెలియజేశారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ విషయములో కొంత మంది లేనిపోని అపో హలను సృష్టిస్తున్నారని, అందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఓ కమిటీని ఏర్పాటు చేశామని, ఇంకా ఏవైనా సవరణలు చేయాల్సిన అవసరం ఉంటే సర్క్యులర్ జారీ చేయడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. వచ్చే రెండు, మూడు నెల ల్లో డిజిటల్ మీడియా పాలసీని తీసుకు రాబోతున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ పాలసీ ఓ రూపానికి తీసుకువచ్చామని త్వర లోనే ఫైనల్ చేస్తామని వివరించారు. జర్నలిస్టు లకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నా మని, కోర్టుల్లో ఆటంకాలు లేకుండా ఇళ్ల స్థలాల పంపిణీ చేయడానికి కృషి చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పై ఇటీవల మహిళా దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారని అతి కొద్దిరోజుల్లోనే ఆ తీపి కబురు వినిపిస్తామన్నారు. జర్నలిస్టుల ఉద్యోగాల భద్రతా విషయంలో ఈ ప్రభుత్వం వెనకడుగు వేయబోదన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :