Tuesday, 15 September 2026 03:11:10 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

బండి భగీరథ్ కేసులో కీలక మలుపు..! పోక్సో కేసులో కఠిన సెక్షన్లు జోడింపు

నోటీసులు జారీ చేసిన పోలీసులు

Date : 13 May 2026 09:38 PM Views : 187

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధిత బాలికపై తీవ్రమైన లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు కేసులో మరింత కఠినమైన సెక్షన్లు చేర్చారు. ఇప్పటికే బీఎన్ఎస్ సెక్షన్ 74, 75తో పాటు పోక్సో చట్టంలోని సెక్షన్ 11 రెడ్‌విత్ 12 కింద కేసు నమోదు కాగా తాజాగా బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోక్సో చట్టంలోని సెక్షన్ 5(ఎల్) రెడ్‌విత్ 6ను అదనంగా జోడించారు. ఈ కేసులో నేడు విచారణకు హాజరుకావాలని పోలీసులు భగీరథ్‌కు నోటీసులు జారీ చేశారు. అయితే కేసు నమోదైనప్పటి నుంచి ఆయన అందుబాటులో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. పలుమార్లు ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినా స్విచ్ ఆఫ్‌లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. భగీరథ్ ఫోన్ చివరి లొకేషన్ ఆధారంగా కరీంనగర్ జ్యోతినగర్‌లోని ఆయన మేనమామ, వైద్యుడు సీహెచ్ వంశీకృష్ణ నివాసానికి పోలీసులు వెళ్లగాఅక్కడ ఆయన లేరని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో నోటీసు కాపీని కుటుంబ సభ్యులకు అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ కేసు దర్యాప్తు వేగవంతమైంది. కేసు పర్యవేక్షణాధికారిణిగా నియమితులైన కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ స్వయంగా బాధితురాలి ఇంటికి వెళ్లి దాదాపు రెండు గంటల పాటు వివరాలు సేకరించారు. అనంతరం దర్యాప్తు అధికారులతో సమావేశమై కేసులో కొత్త సెక్షన్లు చేర్చినట్లు సమాచారం. బాధితురాలి తల్లి ఫిర్యాదు ప్రకారం.. గతేడాది అక్టోబర్ 25న భగీరథ్ తన కుమార్తెను నానక్రాంగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి 2 నుంచి 3 రోజుల పాటు అక్కడే ఉండాలని బలవంతం చేసినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో మరో ఇద్దరు స్నేహితులు కూడా అక్కడ ఉన్నట్లు తెలిపారు. అలాగే నవంబర్ 13న మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో, డిసెంబర్ 31న మరో ఫామ్‌హౌస్‌లో కూడా లైంగిక వేధింపులు ఎదురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్రీజర్ తాగాలని బలవంతం చేయడం, రాత్రి సమయంలో గదికి వచ్చి వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించారు. ఈ ఘటనల సమయంలో అక్కడ ఉన్న యువకులు, యువతుల వాంగ్మూలాలను నమోదు చేయాలని పోలీసులు నిర్ణయించారు. కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: