Saturday, 13 June 2026 02:17:36 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

ఘనంగా ప్రారంభమైన శ్రీ దత్తాత్రేయ నవరాత్రి ఉత్సవాలు

Date : 26 November 2025 04:16 PM Views : 277

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో బుధవారం శ్రీ దత్తాత్రేయ నవరాత్రి ఉత్సవములు ఘనంగా ప్రారంభమైనాయి. తొమ్మిది రోజులపాటు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకోనున్నారు. ఆలయంలో జరిగే దైవ కార్యక్రమాల్లో భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. షష్టి తిథి నుండి పౌర్ణమితి వరకు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు హోమగుండం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. దూర్వాస మహర్షి అంబరీసున కు ఇచ్చిన శాపములను విష్ణుమూర్తి గ్రహించి అనేక అవతారంలో స్వీకరించారు. వాటిలో శ్రీ దత్తాత్రేయ అవతారం ఒకటి. ముఖ్యంగా ఈ అవతార ఉద్దేశము ప్రజలు సులభంగా మోక్షము పొందుటకు యోగాభ్యాసమును అభివృద్ధి పరచుట కొరకై అవతరించిన అవతారమే శ్రీ దత్తాత్రేయ అవతారం. మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ దత్తాత్రేయ స్వామి జన్మదినం. శ్రీ దత్తాత్రేయ అవతారము శాశ్వతముగా నిలిచే అవతారము. ఆ క్రమంలో పిఠాపురంలో శ్రీపాద శ్రీ వల్లభునిగా, కరంజాలో శ్రీ నరసింహ సరస్వతిగా, షిరిడి లో శ్రీ సాయినాథునిగా అవతరించి జనులకు సుఖసంపదలను ప్రసాదిస్తున్నారు. రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు 9 రోజులపాటు ప్రత్యేకంగా భజన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని అన్ని వాడల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తొమ్మిది రోజులపాటు ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా గ్రామంలోని పురవీధుల గుండా శ్రీ దత్తాత్రేయ స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. నవరాత్రి ఉత్సవములు అనంతరం అష్టమి తిథి రోజు శ్రీ అనగా దేవి వ్రత కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ పూజారి కొల్లారపు వెంకట రాజం తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :