Tuesday, 28 July 2026 11:44:12 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

ఘనంగా ప్రారంభమైన శ్రీ దత్తాత్రేయ నవరాత్రి ఉత్సవాలు

Date : 26 November 2025 04:16 PM Views : 310

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో బుధవారం శ్రీ దత్తాత్రేయ నవరాత్రి ఉత్సవములు ఘనంగా ప్రారంభమైనాయి. తొమ్మిది రోజులపాటు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకోనున్నారు. ఆలయంలో జరిగే దైవ కార్యక్రమాల్లో భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. షష్టి తిథి నుండి పౌర్ణమితి వరకు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు హోమగుండం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. దూర్వాస మహర్షి అంబరీసున కు ఇచ్చిన శాపములను విష్ణుమూర్తి గ్రహించి అనేక అవతారంలో స్వీకరించారు. వాటిలో శ్రీ దత్తాత్రేయ అవతారం ఒకటి. ముఖ్యంగా ఈ అవతార ఉద్దేశము ప్రజలు సులభంగా మోక్షము పొందుటకు యోగాభ్యాసమును అభివృద్ధి పరచుట కొరకై అవతరించిన అవతారమే శ్రీ దత్తాత్రేయ అవతారం. మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ దత్తాత్రేయ స్వామి జన్మదినం. శ్రీ దత్తాత్రేయ అవతారము శాశ్వతముగా నిలిచే అవతారము. ఆ క్రమంలో పిఠాపురంలో శ్రీపాద శ్రీ వల్లభునిగా, కరంజాలో శ్రీ నరసింహ సరస్వతిగా, షిరిడి లో శ్రీ సాయినాథునిగా అవతరించి జనులకు సుఖసంపదలను ప్రసాదిస్తున్నారు. రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు 9 రోజులపాటు ప్రత్యేకంగా భజన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని అన్ని వాడల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తొమ్మిది రోజులపాటు ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా గ్రామంలోని పురవీధుల గుండా శ్రీ దత్తాత్రేయ స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. నవరాత్రి ఉత్సవములు అనంతరం అష్టమి తిథి రోజు శ్రీ అనగా దేవి వ్రత కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ పూజారి కొల్లారపు వెంకట రాజం తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :