ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పట్టణంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో బుధవారం శ్రీ దత్తాత్రేయ నవరాత్రి ఉత్సవములు ఘనంగా ప్రారంభమైనాయి. తొమ్మిది రోజులపాటు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకోనున్నారు. ఆలయంలో జరిగే దైవ కార్యక్రమాల్లో భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. షష్టి తిథి నుండి పౌర్ణమితి వరకు జరిగే నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజు హోమగుండం కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. దూర్వాస మహర్షి అంబరీసున కు ఇచ్చిన శాపములను విష్ణుమూర్తి గ్రహించి అనేక అవతారంలో స్వీకరించారు. వాటిలో శ్రీ దత్తాత్రేయ అవతారం ఒకటి. ముఖ్యంగా ఈ అవతార ఉద్దేశము ప్రజలు సులభంగా మోక్షము పొందుటకు యోగాభ్యాసమును అభివృద్ధి పరచుట కొరకై అవతరించిన అవతారమే శ్రీ దత్తాత్రేయ అవతారం. మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున శ్రీ దత్తాత్రేయ స్వామి జన్మదినం. శ్రీ దత్తాత్రేయ అవతారము శాశ్వతముగా నిలిచే అవతారము. ఆ క్రమంలో పిఠాపురంలో శ్రీపాద శ్రీ వల్లభునిగా, కరంజాలో శ్రీ నరసింహ సరస్వతిగా, షిరిడి లో శ్రీ సాయినాథునిగా అవతరించి జనులకు సుఖసంపదలను ప్రసాదిస్తున్నారు. రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు 9 రోజులపాటు ప్రత్యేకంగా భజన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని అన్ని వాడల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. తొమ్మిది రోజులపాటు ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా గ్రామంలోని పురవీధుల గుండా శ్రీ దత్తాత్రేయ స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించారు. నవరాత్రి ఉత్సవములు అనంతరం అష్టమి తిథి రోజు శ్రీ అనగా దేవి వ్రత కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ పూజారి కొల్లారపు వెంకట రాజం తెలిపారు.
Admin
E Nivas News