ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : హైదరాబాదులోని శిల్పారామం వేదికగా రోబోటిక్స్ ఐదవ సైన్స్ ఫెయిర్ వార్షికోత్సవ వేడుకలు సోహన్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంతంలోని అన్ని పాఠశాల నుండి స్మార్ట్ గోల్డెన్ టెంపుల్ ప్రాజెక్టులో భాగంగా సాంకేతిక నైపుణ్యం కలిగిన విద్యార్థులంతా తమ అభిరుచులతో తయారుచేసిన పరికరాలన్నీ శిల్పారామం లో ప్రదర్శించారు. అంతే కాకుండా తిరణాలవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు కేవలం విద్యకే పరిమితం కాకుండా తమ యొక్క మేధాశక్తితో తమలో దాగి ఉన్న సృజనాత్మకతను ప్రదర్శించి చేసిన వర్షపు నీటిని పొదుపుగా వాడే యంత్రం, ఆకస్మిక వరదలను గుర్తించే పరికరం, ఆటోమెటిగ్గా రోడ్డు భద్రత నియమాలను గుర్తించే యంత్రం తోపాటు గాలిమర నీటి పరిశుభ్రపరిచే యంత్రంతో పాటు పలు ప్రాజెక్టులను తయారు చేశారు.
ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్ లు బహుమతులు అందజేశారు.
Admin
E Nivas News