ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : విద్యార్థులకి మెనూ ప్రకారం భోజనం పెట్టాలి ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం కోట్ల రూపాయలు వెచ్చించి సంక్షేమ హాస్టల్ లో ఏర్పాటు చేస్తే దాని నిర్వహణ చూసుకోవాల్సిన వసతి గృహ సంక్షేమ అధికారులు మాత్రం తమ స్వార్థం కోసం విద్యార్థులకు మైన ప్రకారం భోజనం పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏఐఎస్బి జిల్లా కనుకుంట్ల సన్ని గౌడ్ ఆరోపించారు. దొనబండ హాస్టల్ వార్డెన్ పై పలు దఫాలుగా ఇచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ తో పాటుగా, రివ్యూ మీటింగ్ కి జిల్లా పర్యటనకు వచ్చిన జిల్లాఎస్సీ శాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాస రావు కు కలిసి పలు సమస్యలపై గురువారం ఫిర్యాదు చేశారు. జిల్లాలో పలువురు వార్డెన్లపై వచ్చిన ఫిర్యాదులపై సరైనవిచారణ చేయకుండా కాలయాపన చేస్తున్న అధికారులపై కూడా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకొంటామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసంహ్యాలకులు దుర్గాప్రసాద్, విద్యార్థి సంఘాలనాయకులు ఉన్నారు.
Admin
E Nivas News