Thursday, 15 January 2026 05:43:28 PM
# చిదినేపల్లి పంచాయతీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి # రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా భోగి వేడుకలు.. # ప్రభుత్వ నర్సింగ్ హాస్టల్‌లో ఫోన్లు లాక్కొని విద్యార్థినుల నిర్బంధం # శ్రీ గోదా దేవి రంగనాథ కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న కోనేరు కోనప్ప.. # రాజురా లో ఘనంగా ముగ్గుల పోటీలు.. # ముగ్గులు భారతీయ మహిళల సృజనాత్మకతకు నిలువెత్తు నిదర్శనం... # విద్యార్థిని మృతదేహానికి నివాళులు అర్పించిన పట్లోల చంద్రశేఖర్ రెడ్డి # భూ భారతి చలాన్ల స్కామ్‌లో అధికారుల పాత్ర పై దర్యాప్తు ముమ్మరం... # రోడ్డు భద్రత, నేరాల నియంత్రణపై అవగాహన కల్పించిన ఆత్మకూరు డిఎస్పి- ఆర్.రామాంజి నాయక్ # అయ్యప్ప వాడలో భోగి మంటలు కార్యక్రమం # సంక్రాంతి ముత్యాల ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు పంపిణీ చేసిన టిడిపి యువ నాయకుడు పి.హుసేన్ భాష # రక్తదానంపై అపోహలు వద్దు- రక్త దానం చేసిన లింగాల గ్రామ యూత్ ను అభినందించిన ఎస్ఐ- పి.తిరుపాలు # శ్రీపాద కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించిన మూల సరోజన పురుషోత్తం రెడ్డి # మోహన్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బీరెల్లి రజిని కుమార్ # సరస్వతి అంత్య పుష్కరా లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి # మన భారత దేశ ప్రజలందరికీ పేరుపేరునా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు # కించపరిచే ఆరోపణలపై సిట్ ఏర్పాటు.. # పండగలు సంతోషంగా జరుపుకోవాలని మా లక్ష్యం # రోడ్డు భద్రత కేవలం పోలీస్ బాధ్యత మాత్రమే కాదు… ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత... # ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను త్వరితగతిన నిర్మించాలి...

భూ భారతి చలాన్ల స్కామ్‌లో అధికారుల పాత్ర పై దర్యాప్తు ముమ్మరం...

Date : 14 January 2026 09:23 PM Views : 26

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో / కొండపర్తి ప్రసన్నకుమార్ : యాదాద్రి జిల్లాలో చోటుచేసుకున్న భూ భారతి చలాన్ల దుర్వినియోగం కేసులో అధికారుల పాత్రపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. కోట్ల రూపాయల విలువైన భూములకు లక్షల్లో స్టాంప్ డ్యూటీ చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.40 నుంచి రూ.50 మాత్రమే చలాన్ కట్టి, మిగతా సొమ్మును అక్రమంగా కాజేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమ లావాదేవీల్లో భూ భారతి పోర్టల్‌ను ఉపయోగించి భారీ స్థాయిలో అవకతవకలు జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారంలో కొందరు అధికారుల సహకారం లేకుండా ఇంత పెద్ద మోసం జరగదనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ భాగోతం వెలుగులోకి రావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం భూ భారతి పోర్టల్‌లోని ఇంటర్‌ఫేస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు అవకాశం లేకుండా సాంకేతిక మార్పులు తీసుకువచ్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ స్కామ్‌లో ఇంకా ఎంత మంది పాత్రధారులు ఉన్నారు? ఎంత మేర నష్టం జరిగింది? అన్న అంశాలపై పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :