ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీకి చెందిన అయ్యప్ప గురు స్వామి కట్ల శంకర్ గురువారం అనారోగ్యంతో మృతి చెందాడు. కట్ల శంకర్ 18 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా అయ్యప్ప మాల ధరిస్తున్నారు. గత రెండు సంవత్సరాల క్రితం లక్షెట్టిపేట పట్టణం నుండి శబరిమల వరకు కరీంనగర్ కు చెందిన నాగరాజు స్వామి బృందంతో తోపాటు లక్షెట్టిపేటకు చెందిన మరో సీనియర్ గురుస్వామి గడ్డం భాస్కర్ తో కలిసి మహా పాదయాత్ర చేశాడు. శంకర్ వృత్తిరీత్యా శుద్ధి జలం వ్యాపారం చేస్తుంటాడు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 11వ వార్డు నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయాడు. గతంలో ఇతను ఐటిడిఏ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థలు కొట్టు శిక్షణ కేంద్రంలో శిక్షకుడిగా పనిచేసేవాడు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కట్ల శంకర్ కు మంచి పేరు ఉంది. అందరితో సన్నిహితంగా ఉండే శంకర్ ఆకస్మిక మృతితో 1987 -88కు చెందిన సి ఎస్ ఐ పాఠశాల స్నేహితులతో పాటు ఆయన బంధువులు, సన్నిహితులు, ప్రజలు అయ్యప్ప స్వాములు, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Admin
E Nivas News